భధ్రాచలం వద్ద పెరిగిన గోదావరి వరద ఉద్ధృతి

భధ్రాచలం వద్ద పెరిగిన గోదావరి వరద ఉద్ధృతి

భధ్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో పట్టణంలో బ్యాక్‌ వాటర్‌ భారీగా చేరుకుంది. రామాలయం తూర్పు మెట్ల వద్ద, అన్నదాన సత్రంలోకి వరద నీరు చేరుతోంది. ఈ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో విస్టా కాంప్లెక్స్‌లో చిరు వ్యాపారుల దుకాణాలు నీట మునిగాయి. దీంతో మోటార్ల ద్వారా బ్యాక్ వాటర్‌ను గోదావరిలోకి వదిలే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అయితే బ్యాక్‌ వాటర్ ఎత్తిపోసే మోటార్లు మొరాయించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు స్థానికులు.

Next Story