
By - Chitralekha |21 July 2023 12:50 PM IST
ఎగువ తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ఉదృతి క్రమంగా పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం సర్ అర్దర్ కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 11 అడుగులు దాటింది. 9 లక్షల క్యూసెక్కుల నీటిని బ్యారేజ్ నుండి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కోనసీమ-పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే కనకాయి లంక కాజ్ వే వరదనీటిలో మునిగిపోయింది. దీంతో రెండు జిల్లాల పరధిలోని లంకగ్రామ ప్రజలకు రాకపోకలకు నిలిచిపోయాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com