కాళేశ్వరం వద్ద మహోగ్రరూపం దాల్చిన గోదావరి

కాళేశ్వరం వద్ద మహోగ్రరూపం దాల్చిన గోదావరి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడి నుంచి గోదావరిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. అటు కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద 11.550 మీటర్ల ఎత్తుకు ప్రాణహిత నీరు చేరింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా పెరగడంతో 75 గేట్లు ఎత్తి 6 లక్షల 10 వేల 250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సరస్వతి బ్యారేజ్ ఔట్‌ఫ్లో 2 లక్షల 32 వేల 526 క్యూసెక్కులుగా ఉంది. దీంతో సరస్వతి బ్యారేజ్ 58 గేట్లు ఎత్తి 2 లక్షల 15 వేల 859 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

Next Story