
By - Chitralekha |20 July 2023 4:11 PM IST
కుండపోత వానలు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నదికి వరద పోటెత్తింది. భద్రాద్రి వద్ద ప్రమాదకరస్థాయికి చేరింది. ప్రస్తుతం 43 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో భద్రాద్రి వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రేపు 48 అడుగులు దాటే అవకాశం ఉందని రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేయాలని అంచనా వేస్తున్నారు. అటు ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. కొత్తగూడెం జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com