
By - jyotsna |14 Jan 2025 5:43 AM IST
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను దవాఖానలకు తరలించి, ప్రాణాలను కాపాడేవారిని మరింత ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా మానవత్వం చాటుకుంటున్న వారికి ఇప్పటివరకు ప్రభుత్వం రూ.5,000 ప్రోత్సాహకాన్ని అందిస్తున్నది.
దీనిని ఐదింతలు పెంచి రూ.25 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్టు కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. నాగ్పూర్లో రోడ్డు భద్రతకు సంబంధించి జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు అనుపమ్ ఖేర్తో కలిసి గడ్కరీ పాల్గొన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాల్లో గాయపడిన వారికి మొదటి ఏడు రోజులు చికిత్స అందించేందుకు అయ్యే ఖర్చును రూ.1.5 లక్షల వరకు ప్రభుత్వం భరించనున్నట్టు గడ్కరీ చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com