
By - Chitralekha |29 July 2023 4:36 PM IST
శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం బాపనకుంటలో ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలింది. ఘటన సమయంలో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నాడు నేడు పేరుతో ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, టీచర్లు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఏడాది నంచి పాఠశాల భవనం శిథిలావస్థలోనే ఉన్నా పట్టించుకునే నాధుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com