
By - Vijayanand |11 Aug 2023 3:23 PM IST
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. చిల్లకూరు మండలం కలవకొండ వద్ద అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నారు గ్రామస్తులు. ఈ తవ్వకాలను అడ్డుకున్న ఓ వ్యక్తిపై.. గ్రావెల్ మాఫియా దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్తితి ఏర్పడింది. దీంతో గ్రావెల్ తవ్వకాల వద్దకు.. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు చేరుకుని లారీల్ని అడ్డుకుని ఆందోళనకు దిగారు. అధికారుల అండతో మాఫియా బరితెగిస్తోందంటున్నారు. ఈ ఘటనపై గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. భారీ యంత్రాలతో పాటు లారీలను స్వాధీనం చేసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com