
By - Bhoopathi |3 July 2023 1:00 PM IST
తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి శోభ నెలకొంది.గురుపౌర్ణమి పురస్కరించుకుని సాయి బాబా ఆలయాల్లో భక్తుల సందడి కన్పిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలోని సాయి బాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వెయ్యి 8లీటర్ల ఆవుపాలతో సాయి బాబాకి అభిషేకం నిర్వహించారు. ఇక 10వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయి బాబా దర్శనం కోసం జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com