విశాఖలో జీవీఎంసీ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన

విశాఖలో జీవీఎంసీ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన

విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట కాంట్రాక్టు కార్మికులు ఆందోళన నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో మున్సిపల్ కార్మికులు భారీగా పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యల సాధన కోసం చలో విజయవాడకు వెళ్లే కార్మికులను పోలీసులు అడ్డుకుని అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం దిగి రాకపోతే సమ్మెకు దిగడం ఖాయమని హెచ్చరిస్తున్నారు సీఐటీయూ నాయకులు.

Next Story