
By - Subba Reddy |14 Jun 2023 12:30 PM IST
పంటలకు కనీస మద్దతు ధర డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న పోరాటం ఉధృతం అవుతోంది. హర్యానాలోని కురుక్షేత్రలో కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు రైతులు. ఈసారి ఉద్యమంలో హర్యానా రైతులు ముందున్నారు. గత కొన్ని రోజుల నుంచి రైతులు వివిధ ప్రాంతాల నుంచి కురుక్షేత్రకు చేరుకుంటున్నారు. దీంతో రైతుల సంఖ్య పెరుగుతోంది. దీంతో పోలీసుల బందోబస్తు పెంచారు. ఎక్కడికి అక్కడ రైతులను నిలువరించేందుకు హర్యానా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com