By - Chitralekha |20 July 2023 9:23 AM GMT
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండపై భక్తుల సౌకర్యార్ధం ఆలయ ఆవరణలో మండపాలు ఏర్పాటు చేయకపోవడంతో దర్శనం తర్వాత బయటకు వచ్చిన భక్తులు వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. విశ్వశివులతో నిర్మించిన ఆలయ మండపాల నుంచి వర్షపు నీరు లీక్ అవుతున్నాయి. లీకేజీ వాటర్ తో స్వామి వారి ప్రసాద తయారీ కేంద్రంలోకి నీరు చేరుకుంది. నీరు నిలవడంతో కొద్ది సేపు ప్రసాద కౌంటర్ను మూసివేశారు. అనంతరం సిబ్బందితో వర్షపు నీటిని తొలగించారు. అనంతరం ప్రసాద తయారీని ప్రారంభించారు
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com