
By - Chitralekha |19 July 2023 2:08 PM IST
భద్రాచలం ఏజెన్సీ వ్యాప్తంగా గత రెండు రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో 22 గేట్లను ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు ఎగువన ఉన్న ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి కూడా వరద నీరు వచ్చి చేరుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com