By - Chitralekha |21 Aug 2023 10:16 AM GMT
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఇవాళ భారీ వర్షం కురిసింది. భక్తులు, స్ధానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం చిన్న వెంకన్న ఆలయానికి వచ్చిన భక్తులు సైతం వర్షంలో తడిసిముద్దయ్యారు. మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కొన్ని గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com