
By - Dayakar |21 July 2023 11:16 AM IST
హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి మూసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతి పెరగడంతో బీబీనగర్ మండలం రుద్రవెల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి వాగు ఉధృతి అంతకంతకు పెరుగుతున్న కారణంగా పోలీసులు భారీ కేట్లను ఏర్పాటు చేసి ప్రజలను వాగు దాటవద్దని హెచ్చరించారు ఉధృతి పెరగడంతో ప్రజలు మరియు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నోరోజులుగా బ్రిడ్జి నిర్మాణం చేపడతామని అధికారులు నాయకులు చెప్పినా, సంవత్సరాలు గడుస్తున్నా బ్రిడ్జి నూతన నిర్మాణం జరగడం లేదని ప్రజలు అంటున్నారు, వాగు ఉధృతి తగ్గే వరకు బీబీనగర్ మండలం రుద్రవెల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com