By - Chitralekha |20 July 2023 6:26 AM GMT
ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. కాకర్లపల్లి ఊర చెరువు వర్షంతో అలుగు పారుతోంది. బేతపల్లి పెద్ద చెరువు పూర్తి సామర్ధ్యానికి చేరుకుంది. లంకసాగర్ ప్రాజెక్టులోనూ భారీగా వరద నీరు చేరింది. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వీఎం బంజర్ బస్టాండ్ ప్రాంగణంలోనూ, రింగ్ సెంటర్లోనూ నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు జీవీఆర్, కిష్టారం ఓపెన్ కాస్ట్ లలో 90 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com