
By - Chitralekha |21 July 2023 4:43 PM IST
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండడంతో ప్రాజెక్టులు నిండుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రజలు అవస్తలు పడుతున్నారు. జహీరాబాద్ పట్టణం జలదిగ్భందంలో చిక్కుకుంది. వసంత్ విహార్ కాలనీలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వసంత్ నగర్ లో డ్రైనేజీలు, కాలువలు లేకపోవడంతో పూర్తిగా జలదగ్భందంలో చిక్కుకు పోయామని కాలనీ వాసులు వాపోతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com