నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా ఇందల్వాయిలో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. గోదావరి, మంజీరా నదులకు భారీగా వరద పోటెత్తింది. సాలూరా బ్రిడ్జి, కందకుర్తి- త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అటు మద్నూర్, పిట్లం, జుక్కల్ మండలాల్లో వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో ముంపు ప్రాంత ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్‌లలో వరద సహాయక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.



Next Story