By - Chitralekha |26 July 2023 9:22 AM GMT
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల వద్ద ఎగువ మానేరు పరవళ్లు తొక్కుతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిద్ధిపేట జిల్లా కూడలి వాగు, కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగుల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో ఎగువ మానేరు నిండుకుండలా మారింది. జలకళ సంతరించుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎగువ మానేరు పరవళ్లు తొక్కుతుండటంతో పర్యాటకులు, స్ధానికులు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com