
By - Chitralekha |19 July 2023 2:04 PM IST
ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్థంభించిపోయింది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు పెనుబల్లి మండల పరిధిలోని లంకసాగర్ ప్రాజెక్టుకు, సత్తుపల్లి మండల పరిధిలోని బేతుపల్లి పెద్ద చెరువుకు వరద నీరు చేరుకుంటోంది. పూర్తి సామర్ధ్యం 16 అడుగులు కాగా, ఇప్పటికే 15.5 అడుగులకు వరద నీరు చేరుకుంది. మరోవైపు భారీ వర్షాలకు జేవీఆర్, కిష్టారం ఓపెన్ కాస్టులో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com