చిల్లకల్లు టోల్ ప్లాజా వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు

చిల్లకల్లు టోల్ ప్లాజా వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై నిన్న సాయంత్రం నుంచే వాహనాలను అధికారులు నిలిపివేస్తున్నారు. నందిగామ మండలం ఐతవరం దగ్గర పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో ముందస్తుగా టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర అవస్ధలు పడుతున్నారు. ప్రయాణికులకు, డ్రైవర్లకు అధికారులు కనీస సౌకర్యాలు కల్పించలేదు. తాగడానికి మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయలేదని వాహనదారులు వాపోతున్నారు.

Next Story