By - Chitralekha |26 July 2023 11:44 AM GMT
హైదరాబాద్లోని జంటజలాశయాలకు వరద పోటెత్తుతోంది. రెండు జలాశయాల నుంచి మూసీలోకి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్లో గరిష్ట నీటిమట్టం 1761.75 అడుగులకు గాను.. 1761.50 అడుగుల మేర నీరు చేరింది. దీంతో 2,750 క్యూసెక్కుల నీటిని మూసీకి వదులుతున్నారు. ఇక ఉస్మాన్సాగర్ గండిపేటలో రెండు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com