Kerala : మత ప్రాతిపదికన కేరళ ఐఏఎస్‌ అధికారుల వాట్సాప్‌ గ్రూపులు

Kerala : మత ప్రాతిపదికన కేరళ ఐఏఎస్‌ అధికారుల వాట్సాప్‌ గ్రూపులు

కేరళలోని ఐఏఎస్‌ అధికారులను మతపరంగా విభజించి, ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అయితే, రాష్ట్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ కే గోపాలకృష్ణన్‌ (ఐఏఎస్‌) ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌ను హ్యాక్‌ చేసి, తనను కొత్త వాట్సాప్‌ గ్రూపులకు అడ్మిన్‌గా చేర్చారని ఆరోపించారు. ‘మల్లు హిందూ అధికారులు’, ‘మల్లు ముస్లిం అధికారులు’, మరికొన్ని గ్రూపులను క్రియేట్‌ చేశారని చెప్పారు. అక్టోబరు 30న మల్లు హిందూ అధికారుల గ్రూపును క్రియేట్‌ చేసి, దానిలో హిందూ ఐఏఎస్‌ అధికారులను చేర్చారని, దీని ఔచిత్యంపై చాలా మంది అధికారులు ప్రశ్నించడంతో దీనిని కొద్ది గంటల్లోనే డిలీట్‌ చేశారని తెలుస్తున్నది.


Next Story