మున్నేరు వాగుకు తగ్గిన వరద ఉధృతి

మున్నేరు వాగుకు తగ్గిన వరద ఉధృతి

మున్నేరు వరద ఉధృతి కొంత తగ్గడంతో ఖమ్మం వాసులు ఊపిరిపీల్చుకున్నారు. పలు కాలనీల్లో వరదలో మునిగిన ఇళ్లు బురదమయంగా మారాయి. ఇంట్లో ఉన్న సామాన్లు నీటిలో తడిసి పనికిరాకుండాపోయాయి. ప్రధానంగా మంచికంటి నగర్‌ను వరద అతలాకుతలం చేసింది. బురదమయంగా మారిన ఇళ్లను శుభ్రం చేసుకోలేకపోతున్నామని బాధితులు వాపోతున్నారు. వరదపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయలేదని దీంతో కట్టుబట్టలతో మిగిలామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో ఆస్తినష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.

Next Story