
By - Bhoopathi |12 Jun 2023 12:15 PM IST
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.02 కోట్ల రూపాయలు వచ్చినట్టు వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారిని 92,238 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 40 వేలమందికిపైగా భక్తులు తలనీలాలు సమర్పించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com