
By - Bhoopathi |18 Jun 2023 4:45 PM IST
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టినపీపీల్స్ మార్చ్ పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఎక్కడికక్కడ ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న భట్టి విక్రమార్క సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా పానగల్లులో భట్టి పాదయాత్ర సాగుతుంది. పాదయాత్రలో భట్టి విక్రమార్క దగ్గరకు వచ్చిన వృద్దురాలు అంజమ్మ తన బాధలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పెన్షన్ రెండు నెలలకోసారి వస్తుందంటూ వాపోయింది. అయితే వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో న్యాయం జరుగుతుందని వృద్ధురాలు అంజమ్మకు భట్టి విక్రమార్క భరోసా కల్పించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com