By - Bhoopathi |27 Jun 2023 4:30 AM GMT
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షి అయిన డ్రైవర్ దస్తగిరి ఎంపీ అవినాష్ అనుచరులు తనను బెదిరిస్తున్నారని ఆరోపించాడు. పిల్లాడిని హింసించాననే ఆరోపణలతో పులివెందుల పోలీసులు తనపై తప్పుడు కేసు నమోదు చేసినట్లు తెలిపాడు. తన భార్య షబానాతో కలిసి దస్తగిరి కడప ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. పులివెందుల పోలీసులు తనపై నమోదు చేసిన తప్పుడు కేసుపై కడప ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఈ కేసు గురించి సీబీఐ ఎస్పీకి కూడా సమాచారం అందించినట్లు చెప్పాడు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com