Mozambique: మొజాంబిక్‌ దేశానికి భారత ఎఫ్‌ఐసీ బోట్లు

Mozambique: మొజాంబిక్‌ దేశానికి భారత ఎఫ్‌ఐసీ బోట్లు

హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకోవడంలో భాగంగా మొజాంబిక్‌ దేశానికి భారత ప్రభుత్వం రెండు ఫాస్ట్‌ ఇంటర్‌సెప్టర్‌ క్రాఫ్ట్‌(ఎఫ్‌ఐసీ) బోట్లను కానుకగా అందజేసింది. ఈ నెల 8న మొజాంబిక్‌ ప్రభుత్వానికి అధికారికంగా వాటిని అప్పగించినట్లు నేవీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో మొజాంబిక్‌లో భారత రాయబారి రాబర్ట్‌ షెట్కింటంగ్, భారత్‌ కొత్తగా నియమించిన రక్షణ సలహాదారుడు కర్నల్‌ అత్రి, ఐఎన్‌ఎస్‌ ఘరియల్‌ కమాండింగ్‌ అధికారి కమాండర్‌ రజన్‌చిబ్, జాతీయ రక్షణ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఆగస్టో కశిమిరో పాల్గొన్నారు. భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ ఘరియర్‌ ద్వారా బోట్లను ఆ దేశానికి తరలించారు. ఈ ఫాస్ట్‌ వాటర్‌ జెట్‌ ప్రొపల్షన్‌ బోట్లు సముద్ర జలాల్లో 45 నాటికల్‌ మైళ్ల వేగంతో దూసుకుపోతాయని నేవీ వర్గాలు వెల్లడించాయి.

Next Story