
By - Bhoopathi |5 July 2023 7:30 AM IST
శాఫ్ చాంపియన్షిప్లో భారత ఫుట్బాల్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది.బెంగళూరు వేదికగా ఫైనల్ పోరులో కువైట్ను మట్టి కరిపించి మరోసారి టైటిల్ విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో భారత జట్టు పెనాల్టీ షూటౌట్లో 5-4 తేడాతో ఘన విజయం సాధించింది. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. చివరికి భారత్ గోల్ కీపర్ గుర్ప్రీత్ అద్భుతంగా బంతిని అడ్డుకుని జట్టును విజేతగా నిలిపాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత ఫుట్బాల్ జట్టు ఈ గెలుపుతో తొమ్మిదోసారి టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. అంతకు ముందు 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021లో శాఫ్ ఛాంపియన్గా భారత్ నిలిచింది .
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com