
By - Vijayanand |31 Aug 2023 4:52 PM IST
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్ నెస్ సెంటర్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. నిమ్స్ ఆస్పత్రిలో ప్రకృతి వైద్య విభాగం అందుబాటులోకి వచ్చింది. యోగ, ప్రకృతి వైద్యం అందించాలనే ఉద్దేశంతో యోగాసనాలతో పాటు 159 రకాల థెరపిలను ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్ నెస్ సెంటర్ ద్వారా వైద్య సేవలు అందిస్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు. త్వరలో కొత్తగా మరో 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com