By - Chitralekha |4 Aug 2023 10:47 AM GMT
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కునిరసన సెగ తగిలింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం తోటపాలేం గ్రామంలో గడపగడపు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే హజరయ్యారు. తోటపాలెం గ్రామంలో మంచి నీటి కులాయిలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్ధలేదని ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు. ఎమ్మెల్యేగా గెలిచి చేసిన అభివృద్ధి శూన్యం అంటూ ఎమ్మెల్యే కిరణ్ ను అడ్డుకున్నారు. నాలుగేళ్లుగా కనిపించకుండా పోయి ఇప్పుడెందుకు వచ్చారు అంటూ మండిపడ్డారు. ఉపాధి హామీ పనులు కూడా తీసేసి తమ పొట్టలు కొట్టారని ఎమ్మెల్యే కిరణ్పై తోటపాలెం గ్రామ మహిళలు మండిపడ్డారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com