
By - Bhoopathi |17 Jun 2023 2:15 PM IST
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి.3 రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు ఎమ్మెల్యేకి సంబంధించిన కంపెనీలు,ఆడిటర్లు, ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టారు.కీలక సమాచారాన్ని సేకరించిన ఐటీ అధికారులు వ్యాపార వ్యవహారాలు, చెల్లిస్తున్న పన్నులకు మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించారు.పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనిత బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇక ఇద్దరు ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల బ్యాంకు లాకర్లు గుర్తించిన అధికారులు కీలక డాక్యుమెంట్లు,విలువైన ఆభరణాలు గుర్తించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com