By - Chitralekha |23 Aug 2023 10:52 AM GMT
కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ కకావికలం అయ్యాయని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలకు దిక్కుతోచడంలేదన్నారు. తమ అధినేత నిర్ణయంపై అందరికి పూర్తి విశ్వాసం ఉందన్న ఆయన.. బీఆర్ఎస్లో క్రమశిక్షణ గల నేతలు, కార్యకర్తలు ఉన్నారన్నారు. అందరూ పార్టీ నిర్ణయం మేరకు పనిచేస్తారని చెప్పారు. కేసీఆర్ను వదులుకుంటే మళ్లీ కష్టాలు తప్పవని తెలిపారు. 75 ఏళ్లుగా కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. పోటీ పడి రాహుల్ గాంధీ, మోదీ అనుచరులు అసంతృప్తుల కోసం కాగడా పట్టి వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు. 119 నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలకు అభ్యర్థులే లేరన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com