
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై . పర్యవేక్షణ ముసుగులో రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్న జగన్ సర్కార్ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు సహా ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలు, విడిది అవసరాలకు 2.27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా విభాగాలకు క్యాంపు కార్యాలయాల స్థలాలు అందుబాటులో లేకపోతే విశాఖలోని మిలీనియం టవర్లు, సమీపంలోని A, B బ్లాక్ భవనాలు కేటాయిస్తున్నట్లు. ప్రభుత్వం వెల్లడించింది. సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ, గ్రామ వార్డు సచివాలయశాఖ, ఇంధనశాఖలు మినహా మిగతా 35 శాఖలకు కార్యాలయాల ఏర్పాటుకు భవనాలను సూచిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్ర విశ్వ విద్యాలయం, రుషికొండ, చినగదిలి, ఎండాడ, హనుమంత్వాక తదితర ప్రాంతాల్లో భవనాల కేటాయింపు పూర్తి చేసింది. అధికారుల కమిటీ సిఫార్సుల మేరకు వివిధ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం..ఎక్కడ ఏర్పాటు చేస్తారనే అంశాన్ని ప్రభుత్వం... ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com