
By - Vijayanand |8 Aug 2023 4:33 PM IST
సీఎం జగన్ పర్యటనతో కోనసీమ లంక గ్రామాల ప్రజల కష్టాలు పడుతున్నారు. సీఎం సభ నేపధ్యంలో ఉదయం నుంచే వారిని సభాస్థలికి తరలించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చంటి పిల్లలతో మహిళలు నానా అవస్థలు పడ్డారు. కనీసం మంచినీరు దొరక్క నీరసంతో సభా వేదిక వద్దే కూలబడ్డారు. ఆకలితో పిల్లలు ఏడుస్తున్నా.. ఆంక్షల పేరుతో వారిని పోలీసులు కదలనివ్వలేదు. ఆకలితో మరికొందరు పక్కనే కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు కోసుకు తిన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com