
By - Vijayanand |8 Aug 2023 4:43 PM IST
మూడో విడత వారాహి యాత్రకు పవన్ సిద్ధమయ్యారు. ఈనెల 10 నుంచి విశాఖలో ఆయన పర్యటించనున్నారు. మూడోవిడత వారాహి యాత్రకు సంబంధించి మాడుగుల నియోజకవర్గం జనసేన నేతలు పోస్టర్లను విడుదల చేశారు. పవన్ యాత్రకు భారీగా అభిమానులు, జనసైనికులు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. చలో విశాఖను జయప్రదం చేయాలన్నారు. వారాహియాత్రలో భాగంగా జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పారు. ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై పవన్ ఆర్జీలను స్వీకరిస్తారని జనసేన నేత రాయపురెడ్డి వెల్లడించారు. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లిలో ఇసుక దోపిడీ, భూ కబ్జాలను పవన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com