ఇవాళ ఉదయం నుంచి తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామాలు చకచకా సాగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడంతో చేరికలు ఊపందుకున్నాయి. కీలక నేతల ఇళ్లకు రేవంత్రెడ్డి స్వయంగా వెళ్లడం.. వారితో ఏకాంతంగా చర్చించడం జరుగుతోంది. కోమటిరెడ్డి ఇంటితో మొదలైన రేవంత్ సమావేశాలు.. జూపల్లి, పొంగులేటి ఇంట్లో కూడా కొనసాగాయి. పొంగులేటి నివాసంలో కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల కీలక నేతలతో సుదీర్ఘ మంతనాలు కొనసాగుతున్నాయి. అతి త్వరలో కీలక నేతలందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈనెల 25న రాహుల్గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కూచుకుళ్ల దామోదర్రెడ్డి సహా పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com