Telangana: ఆయుష్‌ కాలేజీల వద్ద జూనియర్‌ డాక్టర్ల ఆందోళన

Telangana: ఆయుష్‌ కాలేజీల వద్ద జూనియర్‌ డాక్టర్ల ఆందోళన

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆయుష్‌ కాలేజీల వద్ద జూనియర్‌ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. గత 22 రోజులుగా వీరు ఆందోళనాపథంలో ఉన్నారు. ప్రతి రెండేళ్లకు ఓసారి ఉపకార వేతనం 15 శాతం పెంచాలని 2014లో ఇచ్చిన జీవోను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కరోన సమయంలో మౌలిక వసతులు లేకున్నా వైద్య సేవలు అందించామని.. గత ఏడాది డిసెంబర్ నుంచి స్టైఫండ్‌ రావడం లేదని వాపోతున్నారు. స్టైఫండ్‌ పెంచకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని జూనియర్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వానికి ఇష్టం లేకుంటే ఆయుష్‌ శాఖను తొలగించాలన్నారు.

Next Story