
By - Chitralekha |24 July 2023 4:01 PM IST
వైసీపీ నేతలు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతో విశాఖలోని చిట్టివలస జ్యూట్ మిల్ కార్మికులు రోడ్డున పడ్డారు. జ్యూట్ మిల్ తెరిపిస్తామని నాడు వైసీపీ హామీ ఇచ్చిందని.. తీరా అధికారంలోకి వచ్చాక యాజమాన్యంతో కుమ్మక్కైందని కార్మికులు ఆరోపించారు. తూతూమంత్రంగా సెటిల్మెంట్ చేసి తమకు ఉపాధి లేకుండా చేశారన్నారు. కోట్లాది రూపాయల విలువైన జ్యూట్మిల్ సైట్లో రియల్ ఎస్టేట్కు తెరలేపారన్నారు. పీఎఫ్, పెన్షన్ కోసం ప్రజాప్రతినిధులు, యాజమాన్యం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో కలెక్టరేట్కు వచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com