Cricket stadium: అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి కర్ణాటక సీఎం శంకుస్థాపన

Cricket stadium: అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి కర్ణాటక సీఎం శంకుస్థాపన

కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మించాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ ఎట్టకేలకు నెరవేరింది. ఈ మేరకు ‘కర్ణాటక ఇండస్ట్రియల్‌ ఏరియాస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ( నుంచి కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ కు భూకేటాయింపు జరిగింది. స్టేడియం నిర్మాణానికి మొత్తం 41 ఎకరాల భూమిని కేటాయించారు.ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇవాళ ఉదయం తుమకూరులో క్రికెట్‌ స్టేడియం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. మొత్తం 41 ఎకరాల్లో నిర్మించనున్న ఈ స్టేడియాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు మొత్తం రూ.150 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా వేశారు. స్టేడియం పూర్తయితే ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Next Story