తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఛాతిలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని ఆయన కుమారుడు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే వైరల్ జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్కు ఛాతీలో ఇన్ఫెక్షన్ వచ్చిందని వివరించారు. సీఎం కేసీఆర్కు వైరల్ ఇన్ఫెక్షన్ తరువాత ఛాతీలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మొదలైందన్న ఆయన. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారని. త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని తెలిపారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. వైరల్ ఫీవర్ వల్ల సీఎం కేసీఆర్ గత 3 వారాలుగా ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజలకు దూరంగా ఉంటున్నారు. వైద్యులు ఆయనకు ప్రగతి భవన్లో చికిత్స అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్తో బాధ పడుతున్నారని, ప్రగతి భవన్లో ఐదుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని సెప్టెంబర్ 26న కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వారం రోజులుగా జ్వరం, దగ్గు సమస్యలతో కేసీఆర్ బాధపడుతున్నారని తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని వీరాభిమానులు, కార్యకర్తలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com