
By - Vijayanand |13 Aug 2023 12:43 PM IST
వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు టీడీపీ నేత కేసినేని చిన్ని. లోకేష్ యువగళం పాదయాత్ర ఈ నెల 19న ఎన్టీఆర్ జిల్లాలో అడుగుపెడుతుండటంతో... స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పాదయాత్ర నిర్విఘ్నంగా జరగాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మరోసారి చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకున్నట్లు తెలిపారు. చిత్తూరులో ప్రారంభమైన యువగళం పాదయాత్ర.... కృష్ణా జిల్లాలో అడుగుపెడుతోందన్న ఆయన.... జగన్ ప్రభుత్వానికి లోకేష్ రెడ్డి అలర్ట్ జారీ చేశారన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com