
By - Chitralekha |7 Aug 2023 4:48 PM IST
ఆర్టీసీ కార్మికులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులేనని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఖమ్మం వెళ్లిన పువ్వాడకు ఘన స్వాగతం లభించింది. మున్నేరు కరకట్ట కోసం 150 కోట్ల రూపాయలు మంజూరు కావడంతో పరివాహక ప్రాంత వాసులు మంత్రిని గజమాలతో సత్కరించారు. ఇక ఆర్టీసీ కార్మికులు జీతాలు అందుకుంటారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని బెన్ఫిట్స్ లభిస్తాయన్నారు. ఇక ఆర్టీసీ విలీన బిల్లుకు ఎంతో మంది అడ్డుపడాలని చూశారని పువ్వాడ అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com