
By - Chitralekha |22 Aug 2023 12:10 PM IST
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే బరిలో తాను ఉంటానని ఏ పార్టీ నుంచి పోటీలో ఉంటాననేది త్వరలో ప్రకటిస్తానని అన్నారు. ఎమ్మెల్యేగా ఇంకా 49 రోజుల వరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. తన భర్త మనోవేదనతోనే కాంగ్రెస్లో చేరారని తెలిపారు. కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి చూపిస్తా అని రేఖానాయక్ ధీమా వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com