
By - Bhoopathi |14 July 2023 11:15 AM IST
కియా పరిశ్రమ ఏర్పాటుతో సంపద సృష్టి జరగడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అనంతపురంలోని కియా పరిశ్రమ మిలియన్ కార్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కియా పరిశ్రమకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ సంకల్పం, సమర్ధవంతమైన ప్రభుత్వ విధానాల కారణంగా కియా పరిశ్రమ 2017లో రాష్ట్రానికి వచ్చిందన్న చంద్రబాబు.. కియా పరిశ్రమ ద్వారా వేలాది మంది రాయలసీమ యువత స్థానికంగా ఉపాధి పొందుతోందని సంతోషం వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com