ఈనెల 21న TS బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డి బాధ్యతలు

ఈనెల 21న TS బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డి బాధ్యతలు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 21న ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 21న బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర సభ ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ అధ్యక్షుల్లో ఎవరికీ దక్కని అరుదైన ఘనత కిషన్‌రెడ్డి సొంతమైంది. నాలుగుసార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డ్‌ సృష్టించారు.

Next Story