By - Bhoopathi |24 Jun 2023 10:45 AM GMT
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. హుటాహుటిన ఢిల్లీ రావాలంటూ ఆదేశాలు అందాయి. దీంతో హైదరాబాద్లో ఇవాళ్టి కార్యక్రమాల్ని రద్దు చేసుకున్న కిషన్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఇప్పటికే హైకమాండ్ నుంచి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పిలుపు వచ్చింది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. రేపు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రానున్నారు. పార్టీ వ్యవహారాలు సెట్ చేసే పనిలో హైకమాండ్ ఉంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com