
By - Vijayanand |12 Aug 2023 12:19 PM IST
Group 2 పరీక్ష వాయిదా కోసం పోరాటం కొనసాగుతోంది. గన్ పార్క్ వద్ద మౌన దీక్ష చేయాలని అఖిల పక్షం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంను.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గన్ పార్క్ వద్ద 144 సెక్షన్ విధించారు. గన్ పార్కు దగ్గరకు ఎవర్నీ రానివ్వకుండా బ్యారికేడ్లు పెట్టారు. గన్ పార్కు, అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com