AP: క్షీణించిన కోడికత్తి శ్రీను ఆరోగ్యం

AP: క్షీణించిన కోడికత్తి శ్రీను ఆరోగ్యం

ముఖ్యమంత్రి జగన్‌ న్యాయం చేయాలంటూ జైల్లో నిరాహార దీక్ష చేపట్టిన కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించింది. జైల్లో దళిత సంఘ నేతలు శ్రీనును కలిశారు. ఆ సమయంలో ఒక జైలు అధికారి, మరో ఖైదీ శ్రీనును చేతులతో మోసుకొచ్చినట్లు దళిత సంఘ నేతలు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి జైల్లో శ్రీను దీక్షను కొనసాగిస్తున్నప్పటికీ, జైలు అధికారులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయకపోవడంపై విశాఖ దళిత సంఘాల కన్వీనర్‌ బూసి వెంకట్రావు అనుమానం వ్యక్తం చేశారు. దీక్ష విరమింపజేయడానికి జైల్లో తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని, విశాఖ జైల్లో ఏదైనా ప్రాణహాని జరగొచ్చని, వెంటనే శ్రీనును తరలించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శ్రీను హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయాలని కోరుతూ జిల్లా లీగల్‌ అథారిటీలో న్యాయవాది సలీం పిటిషన్‌ వేశారు.

Next Story