By - Chitralekha |24 Aug 2023 11:07 AM GMT
ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్రెడ్డి సవాల్ విసిరారు..కర్నూలులో హైకోర్టు ఏ రోజు ఏర్పాటు చేస్తారో చెప్పాలన్నారు.. జ్యుడిషల్ కేపిటల్ పేరుతో జగన్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని కోట్ల విమర్శించారు. ఇరిగేషన్పై మంత్రి బుగ్గన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటుధర దక్కకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు మంత్రులకు కనపడటం లేదా అని కోట్ల సూర్యప్రకాష్రెడ్డి ప్రశ్నించారు. ఇసుక, మద్యం, మైనింగ్లో దోచుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో డబ్బు పంపణీకి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com