TS: "దళితుల్ని ధనికులుగా చేసేందుకే దళితబంధు"

TS: దళితుల్ని ధనికులుగా చేసేందుకే దళితబంధు

దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల్ని ధనికులుగా చేసేందుకు.. తెలంగాణలో దళితబంధు కార్యక్రమం చేపట్టామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. సిరిసిల్లలో పర్యటించిన ఆయన.. కుటీర వ్యాపార పథకం లబ్ధిదారులకు డీడీలు పంపిణీ చేశారు. దళితబంధు పథకం కింద మంజూరైన బస్సు, కాంక్రీట్‌ మిక్సర్‌లను కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో పథంలో దూసుకెళుతుందని కేటీఆర్‌ అన్నారు. సంపద సృష్టించేలా సిరిసిల్ల జిల్లాలో దళితబంధు యూనిట్‌ల గ్రౌండింగ్‌ జరుగుతుందని వెల్లడించారు. గత ప్రభుత్వాలు దళితులకు ఏం చేశాయని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Next Story